ప్రభాస్-మారుతి.. 10న ఓపెనింగ్

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాకు ముహూర్తం ఫిక్సయింది. వచ్చే నెల నుంచే షూటింగ్ షురూ కానుంది. ఈ నెల 10నే చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నారు. హారర్‌ కథతో, మారుతి మార్క్‌ వినోదంతో ఈ చిత్రం రూపొందనున్నట్టు తెలిసింది.

ఇందులో ప్రభాస్‌కి జోడీగా ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారు. ఇప్పటికే మాళవిక మోహన్, రాశీఖన్నా, శీలీల, అనుష్క పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రభాస్ కు జోడీగా మరోసారి అనుష్క జోడి కడితే.. సినిమాపై అంచనాలు మరింత పెరగడం గ్యారెంటీ.