హాస్పిటల్ లో చేరిన సీఎం

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ అనారోగ్యానికి గురయ్యారు. బుధవారం అర్థరాత్రి ఆయన సడన్ గా అస్వస్థతకు గురయ్యారు. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారు. పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా మాన్‌ అనారోగ్యానికి గురైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో పంజాబ్ ఆప్ లో మొదటి నుంచి కీలక పాత్ర పోషిస్తున్న భగవంత్ మాన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు ఆప్ అధినేత క్రేజీవాల్. ఢిల్లీ తర్వాత ఆప్ ఖాతాలో పడిన రెండో రాష్ట్రం పంజాబ్. దేశంలో కాంగ్రెస్ రోజురోజుకి దిగాజరుతుంటే.. ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ.. ఆప్ ఎగబాకుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేలా ప్రణాఌకలు సిద్ధం చేసుకుంటోంది.