‘కార్తికేయ2’ ట్రైలర్ టాక్

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తికేయ’ (2014) సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ ఈ సినిమా సీక్వెల్ గా కార్తికేయ 2 వస్తున్న సంగతి తెలిసిందే. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఈ సినిమా ట్రైలర్ ను రిలీజైంది.

 ‘నా వరకూ రానంత వరకే సమస్య. నా వరకూ వచ్చాక అది సమాధానం’ అంటూ చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. మొదటి భాగం ‘కార్తికేయ’ను మించిన ట్విస్టులు సీక్వెల్ లో ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఆద్యంతం ఉత్కంఠగా అలరించేలా ట్రైలర్‌ కట్ చేశారు. శ్రీకృష్ణుడి చరిత్రతో ముడిపడిన కథ ఇది. ఆ చరిత్రలోకి డా.కార్తికేయ చేసే ప్రయాణం ఆసక్తికరం. ‘కార్తికేయ’ తర్వాత ఆ కలయికలోనే రూపొందిన ఈ చిత్రం అంచనాల్ని అందుకునేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ట్రైలర్ ను చూస్తే.. అది నిజమే అనిపిస్తోంది.