టీ-కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో తెలంగాణ  కాంగ్రెస్ నేతలు ఈడీ నోటీసులు జారీ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని నలుగురు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు.

ఇప్పటివరకు తమకు ఈడీ నుంచి నోటీసులు అందలేదని మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, గీతారెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌లు తెలిపారు. 
పార్టీ విరాళం కింద డబ్బులు ఇచ్చింది వాస్తవమేనని వారు తెలిపారు. అయితే, చెక్కుల రూపంలో విరాళం ఇచ్చామని.. అందులో తప్పేం లేదని వారు స్పష్టం చేశారు. ఈడీ నుంచి నోటీసులు వస్తే తప్పకుండా విచారణకు హాజరవుతామని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.