వైకాపా శాశ్వతంగా డిస్మిస్‌ అవుతుందట

ఏపీలో ఫ్యాన్ పార్టీకి వ్యతిరేక షురూ అయినట్టు కనబడుతుంది. పట్టభద్రుల స్థానాలకు జరిగిన మూడు స్థానాలను టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక ప్రజాప్రతినిధుల కోటాలో అసలు ఏమాత్రం ఛాన్స్ లేని పచ్చపార్టీ ఓ స్థానాన్ని గెలిచింది. అనూహ్యంగా పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలుపొందారు. దీనికి కారణమైన నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వీరిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు.

తాజాగా మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని కామెంట్ చేశారు.  రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల కోసం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి వైకాపా శాశ్వతంగా డిస్మిస్‌ అవుతుంది. రాజకీయ ప్రజా సునామీ రాబోతోందన్నారు.