ఇండియన్‌ ఓటీటీలో ‘ఫర్జీ’ టాప్

షాహిద్‌కపూర్‌, రాశీఖన్నా, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోనే కాదు, ఇండియన్‌ ఓటీటీ వేదికల్లో అత్యధికమంది వీక్షించిన వెబ్‌సిరీస్‌గా రికార్డు సృష్టించింది.

రాజ్‌, డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ఫర్జీ’ ఫిబ్రవరిలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ మొదలైంది. ఈ వెబ్ సిరీస్ ను ఇప్పటివరకూ 37 మిలియన్‌ వ్యూవర్స్‌ వీక్షించినట్లు ఓర్‌మ్యాక్స్‌ మీడియా పేర్కొంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న అజయ్‌ దేవ్‌గణ్‌ ‘రుద్ర’ (32.5 మిలియన్‌ వ్యూవర్స్‌) జితేంద్రకుమార్‌ ‘పంచాయత్‌’ (29.6 మిలియన్‌ వ్యూవర్స్‌), పంకజ్‌ త్రిపాఠి ‘క్రిమినల్ జస్టిస్‌’ (29.1మిలియన్‌ వ్యూవర్స్‌) ఆదిత్య రాయ్‌కపూర్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’ (27.2 మిలియన్‌ వ్యూవర్స్‌)లను ‘ఫర్జీ’ దాటేసింది.