ఇది కేవలం తీగ మాత్రమే !

స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ఆయనకు కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. రూ. 271 కోట్ల ప్రభుత్వ ధనాన్ని బాబు దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు. ప్రస్తుతం బాబు రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇది కేవలం తీగ మాత్రమే. ఇంకా డొంక మొత్తం కదలబోతుంది. మీ పాపం పండబోతుందన్నారు.

1977 నుంచి చంద్రబాబు ఎన్నో స్కాములు చేశారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఆడియోలో మాట్లాడారు. స్లీపర్ సెల్స్ ద్వారా ఇన్నాళ్లు చంద్రబాబు రక్షింపబడుతున్నారు. ఏ కేసులోను పట్టుబడకుండా నక్కజిత్తులతో స్టీలు తెచ్చుకుంటూ తప్పించుకుంటున్నారని మంత్రి షేర్ని నాని ఆరోపించారు. అయితే ఇన్నాళ్లు ఒక కథ.. ఇకపై ఒక కథ .. చంద్రబాబు డొంక మొత్తం కదలబోతుందని ఆయన హెచ్చరించారు.

ఇక చంద్రబాబు ను అరెస్ట్ చేసిన వ్యవహారం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై కూడా మంత్రి షేర్ని నాని స్పందించారు. రెండ్రోజుల ముందే తనని అరెస్ట్ చేస్తారని చంద్రబాబుకు ఎలా తెలుసు. ఆయన స్లీపర్ సిల్స్ ద్వారా ఈ విషయం తెలిసిందని ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం. .14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు కు సీఐడీ అధికారులు ఎక్కడ ఇబ్బంది పట్టలేదు. ఆయన గౌరవానికి ఆటంకం కలిగించలేదు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో, ఆయన లాయర్లతో మాట్లాడానికి అవకాశం ఇచ్చారని వివరించారు. అంతేకాదు.. ఇక సీఐడీ విచారణలో ఏం అడిగినా.. బాబు.. ఏమో .. తెలియదు. మర్చిపోయానని చెప్పారు. జూనియర్ ఎన్ టీఆర్ అంటే చంద్రబాబుకు పడదు. కానీ ఆయన సినిమాలోని డైలాగులను మాత్రం బాగానే వాడుకునారని ఎద్దేవా చేశారు.