సైకో పాలన పోవాలి : టీడీపీ ఆల్రెడీ పోయింది : వైసీపీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సైకో పాలన పోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అయితే సైకో పాలన పోవాలని టీడీపీ సభ్యుల నినాదాలకు మంత్రి జోగి రమేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సైకో పాలన ఆల్రెడీ పోయింది. 420 చంద్రబాబు జైల్ లో ఉన్నారని అన్నారు.

ఇక అంబరి రాంబాబు తనదైన శైలిలో బాలయ్య ను టార్గెట్ చేశారు. బాలకృష్ణ సభలో విజిల్స్ వేస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత బాలయ్య ఇంటి దగ్గర కూర్చొని విజిల్స్ వేసుకోవాల్సిందే అన్నారు. బాలకృష్ణ చంద్రబాబు సీటు ఎక్కి నిల్చున్నారు. చంద్రబాబు సీటు ఖాళీగా ఉంది. ఆ సీట్లో కూర్చోమంటే బాలయ్య కూర్చోవడం లేదు. ఆ సీట్లో నిలబడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దుర్మార్గాలపై చర్చించే టీడీపీ సభ్యులకు లేదని ఫైర్ అయ్యారు. ఇక ఆందోళనలు చేస్తున్న టీడీపీ సభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకొన్నారు. అచ్చెన్నాయుడుతో పాటు అశోక్ లను ఈ అసెంబ్లీ సీజన్ మొత్తం సస్పెండ్ చేశారు.