ఇలియాన ఈజ్ బ్యాక్

టాలీవుడ్ లో  స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియాన ఇప్పుడు తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను నటించిన ఓ బాలీవుడ్‌ చిత్రం తర్వాత దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయన్నారు.టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్నప్పుడే , అనురాగ్‌ బసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బర్ఫీ’సినిమాలో భాలివుడ్ లో అడుగు పెట్టింది ఇలియాన. ఈ సినిమా భాలివుడ్ లో విజయం సాదించగా,   అందరూ ఇక ఈ భామ అక్కడే సెటిల్ అవుతుంది అనుకున్నారు. దాంతో తెలుగు లో కూడా అవకాశాలు లేకుండా పోయాయి.

ఇలియాన  బాలీవుడ్‌కు వెళ్లాక  సినిమాలు ఎంపిక చేసే విధానంలో సెలక్టివ్‌గా వ్యవహరించానన్నారు . ఏ పని అయినా నిజాయితీగా చేస్తానన్నారు.   ఏ సినిమా చేసినా ఆ సినిమాలో  పాత్రకు వందశాతం న్యాయం చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ, ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. నాకు రావాల్సిన గుర్తింపు రాలేదనిపిస్తుంది. దానికి కారణం కూడా తెలీదు’ అని చెప్పారు.ఇలియానా  ‘దో ఔర్‌ దో ప్యార్‌’తో  సినిమాతో  ప్రేక్షకుల ముందుకు రాగా,  విద్యాబాలన్‌, ప్రతిక్‌ గాంధీలు ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఈ రొమాంటిక్‌ కామెడీ డ్రామా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ అందుకుంది. దీంతో ఇలియాన మల్లీ సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటుందో లేదో చూడాలి మరి.