కేంద్ర కేబినేట్ లో యువతకు పెద్దపీఠ

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం తొలిసారి మంత్రివర్గ విస్తరణ చేసింది. ఇందుకోసం గట్టి కసరత్తే చేసినట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, అనుభవం.. ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు అర్థమవుతోంది. విస్తరణ అనంతరం మహిళా మంత్రుల సంఖ్య 11కు చేరింది.

మోడీ కొత్త టీమ్ లో 50 ఏళ్లలోపువారు 14 మంది ఉన్నారు. యువతరానికి అవకాశం ఇస్తూనే అనుభవానికి పెద్ద పీట తెలుస్తోంది. వృత్తుల పరంగా చూస్తే 13 మంది లాయర్లు, ఆరుగురు డాక్టర్లు, ఐదుగురు ఇంజినీర్లు, ఏడుగురు మాజీ ప్రభుత్వ అధికారులు, మరో ఏడుగురు రీసెర్చి డిగ్రీ, మరో ముగ్గురు బిజినెస్‌ డిగ్రీలు పూర్తి చేసిన వారు ఉన్నారు. 

ఇక సామాజిక వర్గాల పరంగా చూస్తే షెడ్యూల్‌ కులాలకు చెందిన 12 మంది, షెడ్యూల్‌ తెగలకు చెందిన 8 మంది, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన 27 మంది పునర్‌వ్యవస్థీకరణ అనంతరం మంత్రులుగా కొలువురారు.