రోహిత్ రీ ఎంట్రీ.. కెప్టెన్ గా బాధ్యతలు !

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వచ్చేశాడు. బుధవారం స్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌కు సెలక్షన్‌ కమిటీ బుధవారం భారత జట్లను ప్రకటించింది.
గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్లను నడిపించనున్నాడు.

వెస్టిండీస్‌తో వన్డేలు ఫిబ్రవరి 6, 9, 11న అహ్మదాబాద్‌లో, టీ20లు ఫిబ్రవరి 16, 18, 20న కోల్‌కతాలో జరుగుతాయి. ఫాస్ట్‌బౌలర్లు బుమ్రా, షమిలకు విశ్రాంతి కల్పించారు. కేఎల్‌ రాహుల్‌ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉంటాడు. భువనేశ్వర్‌కు టీ20 జట్టులో మాత్రమే స్థానం లభించింది.

వన్డే జట్టు : 

రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌, ధావన్‌, కోహ్లి, సూర్యకుమార్‌, శ్రేయస్‌, దీపక్‌ హుడా, పంత్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేష్‌ ఖాన్‌

టీ20 జట్టు : 

రోహిత్‌, రాహుల్‌, కిషన్‌, కోహ్లి, శ్రేయస్‌, సూర్యకుమార్‌, పంత్‌, వెంకటేశ్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌, బిష్ణోయ్‌, అక్షర్‌ పటేల్‌, చాహల్‌, సుందర్‌, సిరాజ్‌, భువనేశ్వర్‌, అవేష్‌, హర్షల్‌.