కేజ్రీవాల్ స్మార్ట్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్టార్ట్ అనిపించుకుంటున్నారు. శనివారం ఢిల్లీ ప్రభుత్వం 12వేల స్మార్ట్ క్లాసులు ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సీఎం క్రేజీవాల్ హాజరయ్యారు. సీఎం తో పాటుగా డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి సిసోడియా, ఢిల్లీ హోం మినిష్టర్ సత్యేందర్ జైన్ లు కూడా హాజరయ్యారు.

స్మార్ట్ క్లాసు రూంలతో కలిపి కేజ్రీవాల్ ప్రభుత్వం మొత్తం 20వేల క్లాసు రూంలను ఏర్పాటు చేసినట్లు అయింది. అందులో 537కొత్త స్కూల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయని ఢిల్లీ గవర్నమెంట్ స్టేట్మెంట్ లో పేర్కొంది. ఆ క్లాస్ రూంలలో లైబ్రరీలు, మల్టీ పర్పస్ హాల్స్ లాంటివన్నీ ఏర్పాటు చేశారు.