యాదాద్రి యాగం వాయిదా

యాదాద్రి మహాక్షేత్రంలో మార్చి 21 నుంచి నిర్వహించాలనుకున్న శ్రీ సుదర్శన నారసింహ మాహాయాగాన్ని వాయిదా వేస్తున్నట్లు.. యాడా వైస్ ఛైర్మన్ కిషన్‌రావు తెలిపారు. పునర్మిణాన పనులు ఇంకా పూర్తికాకపోవడం.. యాగం ఏర్పాట్లు కూడా పూర్తికాకపోవడంతోనే యాగాన్ని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

మూలమూర్తుల దర్శనం మాత్రం గతంలో నిశ్చయించినట్టుగా మార్చి 28 నుంచే ఉంటుంది. యాగం నిర్వహణకు మరో ముహూర్తం ఖరారు చేస్తున్న యాదాద్రి ఆలయ అర్చకులు.. మేలో సుదర్శన మహాయాగాన్ని నిర్వహించే అవకాశం ఉంది. మే నెలలో  శ్రీ సుదర్శన నారసింహ మాహాయాగాన్ని నిర్వహింఛే అవకాశాలు కనిపిస్తున్నాయి.