కామారెడ్డిలో ఘోర్ రోడ్డు ప్రమాదం.. 5గురు మృతి

కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌ వద్ద కారును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఐదుగురు మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు వ్యక్తులు, ఒక బాలుడు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు టైర్‌ పేలడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.