TSRTC సడెన్ షాక్.. భారీగా ఛార్జీల పెంపు

TSRTC సడెన్ షాక్ ఇచ్చింది. బస్సు ఛార్జీలను భారీగా పెంచింది. ప్యాసింజర్‌ సెస్‌ పేరుతో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో రూ.5 చొప్పున.. సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10వరకు టికెట్‌ రేట్లు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్‌ ఆర్టీసీ వెల్లడించింది.

ఇటీవల రౌండప్‌ విధానాన్ని తీసుకొస్తున్నట్లు పేర్కొన్న ఆర్టీసీ.. పల్లెవెలుగు బస్సు టికెట్‌ ధరల్లో దాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. చిల్లర సమస్య కారణంగా టికెట్‌ రేట్లను రౌండప్‌ చేసినట్లు తెలిపింది. రూ.12 ఛార్జీ ఉన్న చోట టికెట్‌ ధర రూ.10గా, రూ.13, రూ.14 ఉన్న టికెట్‌ ఛార్జీని రూ.15గా చేస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.