కొత్త కవర్ లో పాత ఫోన్లు

ఢిల్లీ లిక్కర్ పాలసీలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ముందు నుంచి ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఆమె ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే గతంలో కవత వాడిన 10 ఫోన్లను ధ్వంసం చేసిందని ఈడీ, సీబీఐ అధికారులు పలు సందర్భాల్లో కోర్టుకు తెలిపారు.

అయితే అనూహ్యంగా మూడోసారి ఈడీ విచారణకు హాజరైన కవిత.. తాను గతంలో వాడిన 10 ఫోన్ లను ఓ కవర్ లో పెట్టి .. విచారణకు తీసుకెళ్లారు. వాటిని మీడియా కు కూడా చూపించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు నుంచి కవిత బయటపడటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయా ? అనే కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు.. ఆమె తెచ్చిన 10 ఫోన్లకు సంబంధించి ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం.