ధోని-కోహ్లీ ముచ్చట.. వైరల్ !

ఇద్దరు లెజెండ్స్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ సరదా సంభాషణ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఐపీఎల్-16 లో భాగంగా సోమవారం బెంగళూరు-చెన్నై జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో.. సీఎస్కే 8 పరుగుల తేడాతో గెలుపుపొందిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. డేవాన్‌ కాన్వే (83; 45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), శివమ్‌ దూబే (52; 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టారు. అనంతరం 227 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు 218 పరుగులకే పరిమితం అయింది. మ్యాక్స్‌వెల్ (76; 36 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), డు ప్లెసిస్‌ (62; 33 బంతుల్లో) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడటంతో ఓ దశలో బెంగళూరు ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ ధోని వ్యూహాల ముందు ఆర్సీబీ తలవంచక తప్పలేదు.

ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని – కోహ్లీ సరదాగా ముచ్చటించారు. ధోని చెప్పిన విషయాలను కింగ్ కోహ్లీ ఆసక్తికరంగా వినడం.. మధ్యలో జోక్ లు.. కోహ్లీ మార్క్ రియాక్షన్ తో వీరి మీటింగ్ వీడియో స్పెషల్ గా నిలిచింది. ఈ వీడియో ట్విట్టర్ ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతుంది. టీమిండియా కెప్టెన్ గా ధోని అద్భుత విజయాలు అందించిన సంగతి తెలిసిందే. ఆయన వారసుడిగా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ కూడా జట్టును విజయవంతంగా ముందుకు నడిపించారు. అగ్రెసివ్ కెప్టెన్సీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడు ఫార్మెట్లలో రోహిత్ నే కెప్టెన్ కాగా.. ఇటీవల కాలంలో టీ20 కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యాను నియమించారు. వన్డే, టెస్టులకు మాత్రం రోహిత్ ను కొనసాగిస్తున్నారు. 

A legendary duo 🙌@imVkohli 🤝 @msdhoni

❤️ 💛#TATAIPL | #RCBvCSK pic.twitter.com/5sOQDkdBLb— IndianPremierLeague (@IPL) April 17, 2023