టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన.. దద్దరిల్లుతున్న ఏపీ అసెంబ్లీ 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలని టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆందోళనలు ప్రారంభించారు. బాబు అరెస్ట్ పై చర్చ జరగాలని పట్టుబడుతున్నారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేస్తున్నారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. 

స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాబు రూ. 371 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నది అభియోగం. ఈ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబు దాఖలు చేసుకున్న రిట్ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై తుదితీరు ఈరోజు వెలువడనుంది.