అమెజాన్ ప్రైమ్ లో #Poacher స్ట్రీమింగ్ .. చూసేయండి !

క్రైమ్ సినిమా/సిరీస్ ప్రియులకు గుడ్ న్యూస్.  ‘పోచర్’ ఓటీటీలోకి వచ్చేసింది. ఢిల్లీ క్రైమ్ లాంటి సిరీస్ డైరెక్ట్ చేసిన రిచీ మెహతా ఈసారి కేరళ అడవుల్లో కోటి కోట్ల విలువైన స్కామ్ ఏనుగుల వేటకు సంబంధించి ఈ సిరీస్ లో చూపించబోతున్నాడు. బాలీవుడ్ నటి ఆలియా భట్ సహ నిర్మాతగా ఈ పోచర్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించింది. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు గెలుచుకున్న రిచీ మెహతా డైరెక్షన్ లో వస్తున్న సిరీస్ కావడంతో ఈ పోచర్ పై ఆసక్తి నెలకొంది.

ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన పోచర్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలోని అతి పెద్ద క్రైమ్ రాకెట్స్ లో ఒకటిగా ఏనుగు దందాల వేటను ఇందులో చూపించారు. నరాలు తెగే ఉత్కంఠతో.. ఆద్యాంతం ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉంది.