లక్నో పై ఢిల్లీ గెలుపు

ఐపీఎల్-17 లో ఢిల్లీ రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం లక్నోతో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జేక్‌ ఫ్రేజర్‌ (55: 35 బంతుల్లో 5 సిక్స్‌లు, 2 ఫోర్లు), పంత్‌ (41: 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచికొట్టారు. పృథ్వీ షా (32) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ రెండు వికెట్లు తీయగా, నవీనుల్‌ హక్‌, యశ్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. బదోని (55) అర్ధశతకంతో చెలరేగగా, రాహుల్‌ (39), అర్షద్‌ ఖాన్‌ (20) పరుగులు చేశారు. డికాక్‌ (19), దీపక్‌  (10), పడిక్కల్‌ (3), స్టాయినిస్‌ (8), పూరన్‌ (0) విఫలం అయ్యారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు, ఖలీల్‌ అహ్మద్‌ రెండు వికెట్లు తీశారు.