ఢిల్లీలో కేసీఆర్ కోరిన కోరికలు ఏంటంటే ?

ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్పురితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా
పలు కోరికలని మంత్రి ముందు ఉంచారు. రాష్ట్రంలోని బసంత్నగర్, మామునూరు, ఆదిలాబాద్, జాక్రాన్పల్లి, దేవరకద్ర, భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.
విమానాశ్రయాల ఏర్పాటుపై 2018లోనే ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు వివరించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈ విమానాశ్రయాల ఏర్పాటుపై సర్వే జరిపినట్లు వెల్లడించారు. దేశీయ విమానాశ్రయాల అభివృద్ధికి అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో విధానంలో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.
