యాదాద్రిపై ఇండియా టుడే ప్రత్యేక కథనం

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి పునర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అద్భుత పుణ్యక్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దితున్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణ పనులు చేపట్టారు. స్వయంగా నిర్మాణ పనులని పర్యవేక్షిస్తున్నారు. తరచూ యాదాద్రి పర్యనటనకు వస్తున్నారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు చేస్తున్నారు. 

ఇక యాదాద్రి నిర్మాణం.. చూసి ఇప్పుడు దేశం అబ్బురపడుతోంది. తాజాగా యాదాద్రి ఆలయ నిర్మాణంపై ఇండియా టుడే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇందులో యాదాద్రి విశేషాలతో పాటు.. ఆలయ పునర్మాణం ప్రత్యేకతలని గురించి ప్రస్తావించారు. అద్భుత ఆలయంగా కీర్తిస్తూ.. రాశారు. దేశంలో దర్శించుకోవాలని ఆలయాల్లో యాదాద్రిని ఒకటిగా పేర్కొన్నారు. ఆ కథనం మీ కోసం..