#NTR30 : తారక్ జంటగా జాన్వీ .. రేపే ఎనౌన్స్ మెంట్ !

అతిలోక సుందరి శ్రీదేవి, నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. ఎన్టీఆర్ మనవడు జూ. ఎన్ టీఆర్ తో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది అభిమానుల కోరిక. ఆ కోరిక ఇప్పుడు తీరబోతుంది.  #NTR30 కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా తారకరత్న మృతితో కాస్త ఆలస్యం అయింది. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే..   ఈ సినిమాలో తారక్ కి జంటగా జాన్వీ నటించబోతున్నారు. ఈ మేరకు రేపే అధికారిక ప్రకటన రాబోతుంది. రేపు జాన్వీ బర్త్ డే కానుకగా ఆమె టాలీవుడ్ ఎంట్రీ గురించి అధికారిక ప్రకటన చేయబోతున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కొరటాల-ఎన్ టీఆర్ కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అది కేవలం తెలుగు, మలయాళంలో మాత్రమే రిలీజ్ అయింది. అయితే ఎన్టీఆర్30 పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. దానికి తగ్గట్టుగానే.. కొరటాల స్క్రిప్ట్ ను రెడీ చేశారని చెబుతున్నారు. అంతేకాదు.. తన మార్క్ సోషల్ మెసేజ్ తో కూడిన కథను చూపించబోతున్నారు. యాక్షన్ ఏపీసోడ్ వీర లెవల్ లో ఉండబోతుంది అంటున్నారు. 

సముద్రం నేపథంలో ఎన్టీఆర్ 30 ఉంటుందట. ఈ నేపథ్యంలో షూటింగ్ ఎక్కువగా భాగం విశాఖపట్నం, గోవాలో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపిస్తారని అంటున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.