సిరాజ్‌ షో.. 55 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా !

దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్ లో ఘోర పరాజయం పాలైన టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది. తాజాగా కేప్‌ టౌన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ను 55 పరుగులకే ఆలౌట్ చేసింది.మహ్మద్‌ సిరాజ్‌ నిప్పులు చెరిగే బంతులు సంధించి సఫారీలకు పట్టపగలే చుక్కలు చూపించాడు. సిరాజ్‌ (6/15) ధాటికి దక్షిణాఫ్రికా తొలి సెషన్‌లోనే 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా (2/25), ముకేశ్‌ కుమార్‌ (2/0) కూడా రాణించారు.

సఫారీ బ్యాటర్లలో డేవిడ్ బెడింగ్‌హమ్‌ (12), వెరినే (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్ ప్రారంభించిన టీమిండియా 2 వికెట్ల నష్టానికి 71 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ 39, గిల్ 18 క్రీజులో ఉన్నారు.  ఒపెనర్లు యశస్వీ జైశ్వాల్ రబడా బౌలింగ్ లో డకౌట్ కాగా.. రోహిత్ శర్మ 39 పరుగులు చేసి.. బర్గర్ బౌలింగ్ లో అవుటయ్యాడు.