టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో తలపడుతోంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ టాస్ కొద్దిసేపటి క్రితమే వేశారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మొదటి బ్యాటింగ్ ఎంచుకున్నారు. పిచ్ స్పిన్ కి అనుకూలిస్తుందని క్యూరేటర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టుకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుండటంతో విజయవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌కు భారత ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేడు. ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కింది.

భారత తుది జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్‌దీప్‌ యాదవ్, బుమ్రా, సిరాజ్

ఆస్ట్రేలియా జట్టు : డేవిడ్ వార్నర్, మిచెల్‌ మార్ష్, స్టీవ్‌ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్‌ హేజిల్‌వుడ్, ఆడమ్‌ జంపా